Home   »  తెలంగాణ   »   బిసిలకు లక్ష రూపాయల ప్రోత్సాహకం చెక్కులు పంపిణీ..

బిసిలకు లక్ష రూపాయల ప్రోత్సాహకం చెక్కులు పంపిణీ..

schedule mounika

జగిత్యాల: బిసిలకు లక్ష రూపాయల ప్రోత్సాహకం చెక్కులు పంపిణీ చేసారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న కేసీఆర్ సర్కార్.. ఇటీవలే ప్రకటించిన మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకంలో భాగంగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి.. మొదటి విడతలో పదివేల మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం బిసి కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ప్రోత్సాహకం 98 మందికి, మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఛైర్మెన్ డా. చంద్ర శేకర్ గౌడ్, ఆర్డివో నరసింహ మూర్తి పాల్గొన్నారు.