దీపావళి పండుగను జరుపుకోవడానికి స్వగ్రామాలకు వెళ్తున్న తెలుగు ప్రజలకు కోసం పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ పలు అదనపు రైలు సర్వీసులను నడపనుంది. ఎంపిక చేసిన రూట్లలో దీపావళి ప్రత్యేక రైళ్ల (Diwali Special Trains) సర్వీసుల ప్రయాణ తేదీలు, ఇతర వివరాలతో పాటు షెడ్యూల్ను రైల్వే శాఖ విడుదల చేసింది.
దీపావళి ప్రత్యేక రైళ్ల Diwali Special Trains జాబితా
వీటిలో చాలా ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా నడుస్తున్నాయి. ఇవి సికింద్రాబాద్, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. రైల్వే డిపార్ట్మెంట్, సికింద్రాబాద్ నుండి బీహార్ లోని చంపారన్ జిల్లాలోని రక్సౌల్ వరకూ నాలుగు అదనపు జన్ సాధారణ్ రైళ్లు నడుస్తాయి.
ఈ రైళ్లు మహారాష్ట్రలోని సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్ మీదుగా ప్రయాణిస్తాయి. ఈ సేవలు నవంబర్ 9 నుండి 30 మధ్య ఎంపిక చేసిన తేదీలలో మాత్రమే నడపనున్నారు.