Home   »  తెలంగాణ   »   గ్యాస్‌ లీకేజ్‌ తో.. ముగ్గురికి అస్వస్థత..

గ్యాస్‌ లీకేజ్‌ తో.. ముగ్గురికి అస్వస్థత..

schedule ranjith

కరీంనగర్ జిల్లాలో గ్యాస్‌ లీకేజ్‌ అయిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది. కరీంనగర్‌ జిల్లాలోని నీటి శుద్ది కేంద్రం లో హైడ్రోక్లోరిక్‌ గ్యాస్‌ లీకేజ్‌ అయింది. వాల్‌ బ్లాక్‌ అవడంతో ప్రమాదం సంభవించిందని ప్లాంట్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్‌ కంట్రోల్‌ చేయడానికి వచ్చిన సిబ్బందిలో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్‌ శుద్ది చేయడానికి మరో 24 గంటలు పట్టనున్నట్లు సమాచారం. హైడ్రో క్లోరిన్ గ్యాస్ నీటిని శుద్ధి చేసేందుకు ఈ గ్యాస్ ను వినియోగిస్తారు.