Home   »  తెలంగాణవార్తలు   »   వారికి ప్రమాద బీమా పథకం గడువు పొడిగింపు

వారికి ప్రమాద బీమా పథకం గడువు పొడిగింపు

schedule raju

తెలంగాణ: ఆటోడ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్‌ జర్నలిస్టులకు ప్రమాద బీమా ను రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. రూ. 5 లక్షల ప్రమాద బీమా వర్తించేలా 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతి ఏటా ఈ పథకాన్ని పొడిగిస్తూ వస్తుండగా… తాజాగా 2024 ఆగస్టు 4 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.