ఉమ్మడి వరంగల్: వరంగల్ జిల్లాలోని సంగెం మండలం మోండ్రాయిలో మంగళవారం రైతుల ఆగ్రహానికి గురై సంగెం మండల వ్యవసాయాధికారి (AO)ని నిర్బంధించిన ఘటన చోటు చేసుకుంది. పంట నష్టం నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని “AO”ను అన్నదాతలు నిర్బంధించారు. వర్షాలు సమయానికి రాక, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అందాల్సిన ప్రభుత్వ ఆర్ధిక పరిహారం అందకుండా చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. AO రాజేందర్ ను రైతు వేధికలో వేసి తాళం వేసి రైతులు నిరసన తెలిపారు.
వ్యవసాయాధికారిని నిర్బంధించిన రైతులు
Related News
Also Read