Home   »  తెలంగాణ   »   తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు… రైలు నిలిపివేత

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు… రైలు నిలిపివేత

schedule raju

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వస్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నెంబర్‌ 12724) S-2 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జంక్షన్‌ సమీపంలో రైలు నిలిచిపోయింది. సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బోగీలోని మంటలను అదుపు చేశారు.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు.. ట్రైన్ ఆగిన వెంటనే భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.