హైదరాబాద్: పాతబస్తీలోని యాకుత్పురా రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి.
ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో రోడ్డుపక్కన ఉన్న దుకాణాల సమీపంలో ఉంచిన విద్యుత్ స్తంభం (11కేవీ) కూలిపోయి వాటిపై పడిపోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడంతో కిరాణం షాపులు, పండ్ల దుకాణాలు, బండ్లు దగ్ధమయ్యాయి.
ప్రాణ నష్టం వాటిల్లలేదని, అయితే రూ.30 వేల నుండి రూ.40 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని మాదన్నపేట SHO తెలిపారు.