Road Accident in Siddipet | సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
ప్రధానాంశాలు
రాజీవ్ రహదారిపై సోమవారం సాయంత్రం ఊహకందని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్ను ఢీ కొట్టి పల్టీలు కొడుతూ ప్రమాదానికి గురైంది. అయితే ఆ సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును ప్రమాదనికి గురియిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వేగంగా వెళుతూ అదుపు తప్పిన కారు
హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న కార్లు ప్రమాదానికి గురయ్యాయి. రెండింటిలో ఓ కారు అదుపు తప్పి డివైడర్ మీదుగా పల్టీలు కొడుతూ వెళ్లింది. ఆ సమయంలో కరీంనగర్ వైపు వెళ్తున్న కారుకు తగలడంతో రెండు కారులు ప్రమాదానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని, బాధితులను సిద్ధిపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు.
ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు (Road Accident in Siddipet)
బాధితులను కరీంనగర్ డెయిరీ అడ్వైజర్ హన్మంతరెడ్డి (48), మెదక్ మాజీ MLA పద్మాదేవేందర్రెడ్డి డ్రైవర్ శోభన్(36), ప్రశాంత్ (34), శోభన్ (44) లుగా గుర్తించారు. ఆ నలుగురిలో శోభన్, ప్రశాంత్ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read | కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా.. 30 మందికి గాయాలు