Home   »  తెలంగాణ   »   బోనస్‌గా రూ.1000 కోట్లు పంపిణీ… ప్రభుత్వ ఉద్యోగుల కు గుడ్ న్యూస్

బోనస్‌గా రూ.1000 కోట్లు పంపిణీ… ప్రభుత్వ ఉద్యోగుల కు గుడ్ న్యూస్

schedule raju

తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని CM Kcr తెలిపారు. RTC కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను కొన్ని శక్తులు అడ్డుకోవాలని ప్రయత్నించినా విజయవంతంగా పూర్తిచేశామని చెప్పారు. త్వరలోనే కొత్త PCRని నియమించి ఉద్యోగుల వేతనాలు పెంచుతామని.. అప్పటి వరకు మధ్యంతరభృతి చెల్లిస్తామని ప్రకటించారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్‌గా రూ.1000 కోట్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం బోనస్‌గా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీ, మత్స్యకారులకోసం చేపల పెంపకం వంటి చర్యలు చేపట్టింది. గీత కార్మికులకు ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు చేసింది. పాత బకాయిలు మాఫీ చేసిందని గుర్తు చేశారు. మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ సోదరులకు 15శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది. రైతు బీమా తరహాలో గీతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల బీమా కల్పించిందని స్ఫష్టం చేశారు సీఎం కేసీఆర్.