గవర్నర్ తమిళిసై ట్విట్టర్ (X) అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానంతో, రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది .
హైదరాబాద్ | తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ (X) అకౌంట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసిన ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Governor Tamilisai సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్
కొంతమంది వ్యక్తులు మంగళవారం గవర్నర్ సోషల్ మీడియా అకౌంట్ ని హ్యాక్ చేశారని ఆరోపిస్తూ రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ పోలీసులు కేసు నమోదు చేసారు.
పోలీసులు మైక్రోబ్లాగింగ్ సైట్(X) నిర్వాహకులను సంప్రదించి, వారికి సమాచారం అందించడంతో పాటు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. హ్యాకర్లు ఖాతాలో ఎటువంటి సందేశాలను పోస్ట్ చేయలేదని తెలిపారు.
Also Read: Verified X Accounts: అధికారిక ట్విట్టర్ ఖాతాలను హైజాక్ చేస్తున్న హ్యాకర్లు