Home   »  తెలంగాణ   »   హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్..

హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్..

schedule mounika

హైదరాబాద్: మహోన్నతమైన మన రాజ్యాంగాన్ని రాజ్యాంగకర్తలు ఎంతో ముందు చూపుతో తయారు చేశారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Governor Tamilisai

హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, CS శాంతికుమారి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. 

బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: Governor Tamilisai..


ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘‘బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజ్యంగం మార్గదర్శకత్వంలో ముందుకెళ్లడం గర్వించదగ్గ విషయమని, ఆ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు ముందుకెళ్తే ప్రజలు ఊరుకోరని, గడిచిన పదేళ్లల్లో పాలకులు అలాగే వ్యవహరించారన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే రాష్ట్రం సాధించుకున్నాం” అని అన్నారు.

నియంతృత్వం ధోరణితో వెళ్లడాన్ని తెలంగాణ సమాజం సహించదన్నారు.”ఎన్నికల్లో తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ప్రజాస్వామ్యంలో అహంకారం, నియంతృత్వం చెల్లదని అన్నారు ‘‘. విధ్వంసానికి గురైన వ్యవస్థలను తిరిగి నిర్మించుకుందాం అని వ్యాఖ్యానించారు.

ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: తమిళిసై

రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలిస్తేనే పేదవాడికి అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. “ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం”అని గవర్నర్ తమిళిసై గారు అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందన్నారు.

‘మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మిగతా గ్యారంటీలనూ అమలు చేస్తామని, గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందెకెళుతున్నామన్నారు. అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నాం’ అని ఆమె తెలిపారు.

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: గవర్నర్ తమిళిసై


సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలను ఉంటుందన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెడతాం. TSPSC ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. దీనిపై ఎలాంటి అపోహలకూ యువత లోనుకావొద్దు’’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.

దావోస్ సదస్సులో రూ.40 వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయన్నారు. ఇందుకు సీఎం, ఆయన బృందాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ గారు తెలిపారు. 

ALSO READ: దేశరాజుపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు