హైదరాబాద్: ఉత్తర తమిళనాడు కోస్తాలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 5 రోజుల్లో తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు(IMD) తెలిపారు.
ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు IMD ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని IMD అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.