Home   »  తెలంగాణవార్తలు   »   బీజేపీ ధర్నాకు హైకోర్టు అనుమతి

బీజేపీ ధర్నాకు హైకోర్టు అనుమతి

schedule raju

హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద BJP రేపు తలపెట్టిన ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం BJP ఇందిరాపార్క్ చౌక్‌లో ధర్నా చేయనుండగా… పోలీసులు అనుమతివ్వకపోవడంతో పోలీసుల అనుమతిపై హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది.  కేవలం ధర్నా చేసుకోవాలని, ఎలాంటి ర్యాలీ చేయవద్దని ఆదేశించింది. అలాగే 500 మందితో ధర్నా చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. 1000 మంది ధర్నాకు వస్తుండటంతో అనుమతి ఇవ్వలేదని పోలీసులు కోర్టుకు తెలపగా.. 1000 మందికి భద్రత కల్పించలేకపోతే, హైదరాబాద్‌లోని కోటి మందికి భద్రత ఎలా కల్పిస్తారని కోర్టు ప్రశ్నించింది.