Home   »  తెలంగాణ   »   సీఎం కె.సి.ఆర్ సంచలన నిర్ణయం..!

సీఎం కె.సి.ఆర్ సంచలన నిర్ణయం..!

schedule vamshi

హైద‌రాబాద్:హైదరాబాద్ నగరంలో మరోసారి భూములను వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం కె.సి.ఆర్ HMDAకు ఆదేశాలు జారీ చేశారు. మోకిల ఫేజ్-2 భూముల వేలానికి నోటిఫికేష‌న్ జారీ చేశారు. 300 ప్లాట్ల‌లో 98,975 గ‌జాల‌ను అమ్మ‌కానికి పెట్టింది.ఈ లేఔట్లలో 300-500 గ‌జాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఆగ‌స్టు 21వ తేదీ వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించింది . రూ.1,180 చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.

వేలంలో పాల్గొనే వారు ముందుగా రూ. ల‌క్ష డిపాజిట్ చేయాలి. చ‌ద‌ర‌పు గ‌జానికి రూ. 25 వేలుగా క‌నీస ధ‌ర నిర్ణ‌యించింది. 98,975 గ‌జాల అమ్మ‌కంతో రూ. 800 కోట్లు ఆదాయం రావొచ్చ‌ని అధికారుల అంచనా . మోకిల ప్లాట్లు తొలి విడుత వేలంలో గ‌రిష్ఠంగా గ‌జానికి రూ. 1.05 ల‌క్ష‌లు , క‌నిష్ఠంగా రూ. 72 వేలు ప‌లికాయి.