జనగాం: పెళ్లైన కొద్ది రోజులకే భర్త హింసిస్తున్నాడని ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగాం జిల్లాలో జరిగింది. రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన అర్చన(20) కు గత మార్చిలో పాలకుర్తి మండలానికి చెందిన విగ్నేష్ తో వివాహం జరిగింది.
కొద్ది రోజుల తర్వాత ఆమె భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రోజు తాగివచ్చి అర్చనను శారీరకంగా హింసించేవాడు. ఆ బాధను తట్టుకోలేక అర్చన శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు విగ్నేష్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు.