హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తుల రాకపోకలను సులభతరం చేసేందుకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైలు తన పని వేళలను సెప్టెంబర్ 28 (గురువారం) పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటన చేసింది.
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) 1 గంట వరకు
మునుపెన్నడూ లేని విధంగా గణేష్ నిమర్జనాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ ఉత్సవాలను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి వచ్చింది అంటూ హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఒక ప్రకటనను జారీ చేసారు.
సాధారణ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 29వ తేదీ ఉదయం 6 గంటలకు సేవలు ప్రారంభమవుతాయి. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచడానికి హైదరాబాద్ మెట్రో రైలు భద్రతా సిబ్బందికి సహకరించాలని తమ అభ్యర్థనను వెల్లడించారు.
పొడిగించిన సేవలు గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు ముగుస్తాయి.
Also read : వినాయకుడి నిమజ్జనం చేస్తుండగా అపశృతి!