TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 ఇంటర్ ఫస్ట్, సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దోస్త్, ఇంజినీరింగ్ తదితర అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. జులై మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్సైట్లో తనిఖీ చేయవచ్చు.
ఈ ఏడాది జరిగిన ఇంటర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో 63.85 శాతం, సెకండియర్లో 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఫుస్టియర్లో బాలురు 54.66% ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ రెగ్యులర్ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ పరీక్షలతో కలిపి మొత్తం 9,48,153 మంది హాజరయ్యారు.