తెలంగాణ: రాజ్భవన్లో మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. మొదటి నుంచి ప్రభుత్వం, గవర్నర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆర్టీసీ బిల్లు ఆమోదం విషయంలోనూ గవర్నర్, ప్రభుత్వం మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. ఈక్రమంలోనే ఇవాళ సీఎం కేసీఆర్, గవర్నర్తో భేటీకావడం ఆసక్తిగా మారింది.
ఈ భేటీలో ప్రధానంగా ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను కేబినెట్ ప్రతిపాదించి రాజ్భవన్కు పంపించారు. కానీ గవ్నరర్ మాత్రం వాటిని ఆమోదించలేదు. దీంతో ఈ అంశం ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పెండింగ్లో మరికొన్ని బిల్లులపై కూడా గవర్నర్తో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపుగా 20 నిమిషాల పాటు సాగింది. అనంతరం మంత్రులందరితో కలిసి గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు.