ప్రధానాంశాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, BRS నేత కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విర్రవీగే మాటలు మాని ప్రజలకోసం పని చేయాలన్నారు.
కేసీఆర్ తప్పు చేశారని అనడం రేవంత్ మూర్ఖత్వం: Koppula Eshwar
ముఖ్యమంత్రి మాట్లాడే భాషపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాలన్నారు. కేసీఆర్ తప్పు చేశారని అనడం రేవంత్ మూర్ఖత్వమని అన్నారు. దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చిల్లరగా మాట్లాడుతున్నారని అన్నారు.
అధికారంలో ఉన్నామని భయపెట్టి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదు: శ్రీనివాస్ గౌడ్
అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కవిత అరెస్ట్తో పాటు పలు ఘటనలు తమ పార్టీ అధినేత కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నాయన్నారు. అధికారంలో ఉన్నామని భయపెట్టి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదన్నారు. అసమానతలు, అణచివేత వల్లే నక్సల్ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పుట్టుకు వచ్చాయన్నారు. ఇలాగే కొనసాగితే తెలంగాణ గడ్డపై మరో ఉద్యమం తలెత్తుతుందని హెచ్చరించారు. కేసీఆర్ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు.
ALSO READ: రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : హరీష్ రావు