దళిత బంధు యొక్క ఇద్దరు లబ్ధిదారుల కథనాన్ని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. వారు మొదట్లో డ్రైవర్లుగా ఉన్నారు. ఇప్పుడు పథకం సహాయంతో బస్సులకు యజమానులు అయ్యారు. ఇదంతా కేసీఆర్ ప్రభుత్వం వల్లనే అని ఆయన కొనియాడారు.
MA&UD మంత్రి మరియు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు దళిత బంధు యొక్క ఇద్దరు లబ్ధిదారుల కథను అడిగి తెలుసుకున్నారు. వారు మొదట్లో డ్రైవర్లుగా పనిచేసే వారు అని ఇప్పుడు పథకం సహాయంతో బస్సుల యజమానిగా అయ్యారని వారు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ట్విటర్లో ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గం నుంచి తెలంగాణ దళితబంధు విజయగాథను పంచుకుంటున్నాను. చందుర్తి గ్రామానికి చెందిన రాగుల సాగర్, నేరెళ్ల శేఖర్. ఇతరులకు డ్రైవర్లుగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు రూ. 20 లక్షల దళితబంధు మొత్తాన్ని ఉపయోగించారు.
SBI నుండి రూ. 20 లక్షల రుణాన్ని కూడా పొందారు. వారి బస్సు ఇప్పుడు TSRTCతో ముడిపడి ఉంది ప్రస్తుతం సిరిసిల్ల నుండి వరంగల్ మధ్య లాభదాయకంగా నడుస్తుంది.