రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మోదీ వేవ్ లేదని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు వ్యాఖ్యానించారు.
ప్రధానాంశాలు
KTR | ఫిబ్రవరి 25 ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన BRS పార్టీ కార్యకర్తల సమావేశంలో KT రామారావు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించని ప్రధాని మోదీ గురించి మనం ఎందుకు ఆలోచించాలని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డ KT రామారావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై KT రామారావు మండిపడ్డారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో CM అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించి ఎన్నికలకు వెళ్తే కనీసం 30 సీట్లు కూడా గెలిచేది కాదన్నారు. రాష్ట్రంలో రైతు బంధు నిధులు ఇంకా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగు నీటి కోసం తిప్పలు మొదలయ్యాయని వివరించారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. BJP, కాంగ్రెస్లను కలుపుతూ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను నాశనం చేస్తున్నాయని KT రామారావు అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో BRS మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన KTR
ఎందరో ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కానీ మనకు తెలంగాణ తెచ్చిన KCR మాత్రం అలాగే ఉంటారు. BRS యొక్క గులాబీ జెండా మాత్రమే గల్లీ మరియు ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) స్వాధీనం చేసుకోవడంపై KTR కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో BRS మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు.
Also Read | BRSకు రాజీనామా చేసిన హైదరాబాద్ డిప్యూటీ మేయర్..!