MLC by-election | తెలంగాణలో ఉపఎన్నికల సందడి మొదలైంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం గురువారం (రేపు) ఉపఎన్నిక జరగనుంది.
తెలంగాణ: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రేపు ఉపఎన్నిక జరగనుంది. పోలింగ్ నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రవినాయక్ మంగళవారం పరిశీలించారు.
ఉపఎన్నికల కోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, BRS నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.
అయితే ఇప్పటివరకు మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉండగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో MLC స్థానానికి రాజీనామా చేశారు. ఈ కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఇప్పుడు ఉప ఎన్నిక (MLC by-election) జరుగుతుంది.
Also Read: BJPలో చేరే యోచనలో ఉన్న రేవంత్ రెడ్డి: KTR