Medaram Sammakka Sarakka Jatara | మేడారం మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి మేడారం జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు.
ప్రధానాంశాలు
Medaram Sammakka Sarakka Jatara | గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో గిరిజన మూలాల గల మేడారం జాతర మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి మేడారం జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ జాతర 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించబడింది. ఈ సంవత్సరం జాతర ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 24, 2024 వరకు (4-రోజులు) జరుగుతుంది.
Medaram Sammakka Sarakka Jatara కు దాదాపు 1.20 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
మేడారం ఒక చిన్న అటవీ గ్రామం సాధారణ సమయంలో జనాభా 300 కూడా దాటని ఈ ప్రాంతంలో ప్రతి రెండు సంవత్సరాలకొకసారి జరిగే ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి దాదాపు కోటి మంది భక్తులు వస్తారు.
జంపన్న వాగు
జంపన్న వాగు గోదావరి నదికి ఉపనది. చరిత్ర ప్రకారం.. జంపన్న ఒక కోయ గిరిజన యోధుడు మరియు గిరిజన దేవత సమ్మక్క కుమారుడు. జంపన్న కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ సంపంగి వాగులో ప్రాణాలు విడిచాడు. దింతో ఆరోజు నుండి జంపన్న వాగుగా భక్తులు పిలుస్తారు. అప్పటి నుండి భక్తులు జంపన్న వాగులో స్నానాలను ఆచరించి పవిత్ర గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి వెళ్తారు.
మొదటి రోజు (21-02-2024) గద్దెకు రానున్న సారలమ్మ
మొదటి రోజు (21-02-2024) ‘మేడారం గద్దె’కి సారలమ్మ వస్తుంది. సారలమ్మ సమ్మక్క కూతురు. మేడారం సమీపంలోని చిన్న గ్రామమైన కన్నెపల్లిలో సారలమ్మ ఆలయంలో ప్రతిష్టించబడింది. ఈరోజు ఉదయం కోయ గిరిజన పూజారులు పూజలు నిర్వహించి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. ఈ సందర్బంగా భక్తులు ‘ఎదురుకోళ్ల ఘట్టం’ నిర్వహిస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవతను ‘జంపన్న వాగు’ మీదుగా మేడారం గద్దెకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
రెండవ రోజు (22-02-2024) గద్దెకు రానున్న సమ్మక్క
రెండవ రోజు (22-02-2024) ‘మేడారం గద్దె’కి సమ్మక్క వస్తుంది. పోలీసులు, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. పోలీసుల రక్షణ మరియు అధికారిక లాంఛనాలతో, పూజారులు సమ్మక్కను గద్దెకు తీసుకువస్తారు (సమ్మక్కను సాధారణంగా చిలుకల గుట్టలో ‘కుంకుమ భరిణ’ రూపంలో ప్రతిష్టిస్తారు). చిలుకల గుట్ట వద్ద మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సమ్మక్క పీఠాధిపతి, సమ్మక్క రాకకు సూచనగా, జిల్లా SP సమ్మక్కను ప్రసన్నం చేసుకోవడానికి మూడుసార్లు తన తుపాకీని గాలిలోకి కాల్చి ‘బలి’ని ప్రారంభిస్తారు. సమ్మక్కను స్తుతిస్తూ నినాదాల మధ్య, పూజారులు దేవతను గద్దెపైకి తీసుకొస్తారు.
మూడవ రోజు సమ్మక్క సారలమ్మ దర్శనం
మూడవ రోజు (23-02-2024) మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సమ్మక్క సారలమ్మకు భక్తులు వివిధ కానుకలు సమర్పిస్తారు. మహిళలు దేవతలకు ‘ఓడి బియ్యం’ మరియు ‘సారె’ సమర్పిస్తారు. ఈ నాలుగు రోజుల ఉత్సవంలో మూడవ రోజు అత్యంత రద్దీగా ఉంటుంది. సమ్మక్క సారలమ్మ జాతరలో ముఖ్యమైన నైవేద్యం ‘బంగారం’ (బెల్లం). అమ్మవారికి బెల్లం బంగారంగా సమర్పిస్తారు.
నాల్గవ రోజు సమ్మక్క మరియు సారలమ్మ వన ప్రవేశం
నాల్గవ రోజు (24-02-2024) మేడారం జాతర చివరి రోజు సమ్మక్క మరియు సారలమ్మ వన ప్రవేశంగా జరుపుకుంటారు. లక్షలాది మంది భక్తులచే పూజించబడిన తరువాత, దేవతలు వనప్రవేశానికి సాగనంపుతారు. గద్దెపైకి వచ్చినప్పుడు వారికి లభించిన అదే భద్రత మరియు అధికారిక లాంఛనాలు అడవిలోకి తిరిగి వెళ్ళేటప్పుడు (వన ప్రవేశం) అందించబడతాయి.
Also Read: ఆదివాసీ జాతరకు ఘనంగా ఏర్పాట్లు