Modi will visit Jagtial | తెలంగాణలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. లోక్సభలో అత్యధిక MP సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దృష్టి సారించారు. లోక్సభలో అత్యధిక MP సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ వరుస ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం ఉదయం 10 గంటలకు జగిత్యాలలో (Modi will visit Jagtial) పర్యటించనున్నారు. ఉదయం 11.15 గంటలకు BJP ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో (విజయ సంకల్ప సభ) పాల్గొంటారు. 11.30 నుంచి 12.20 వరకు జగిత్యాల సభలో మోదీ ప్రసంగించనున్నారు.
MP అభ్యర్థులను ఆశీర్వదించనున్న మోదీ
కాగా, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేయాలని కమలం నేతలు ప్లాన్ చేశారు. బీజేపీ MP అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, గోమసే శ్రీనివాస్లను మోదీ ఆశీర్వదించనున్నారు. గీతా విద్యాలయం గ్రౌండ్స్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సభకు BJP భారీ ఏర్పాట్లు చేసింది. మూడు నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. తర్వాత కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ఆయన బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు.
Also Read: వంద రోజుల పాలనలో కాంగ్రెస్ 100 తప్పులు చేసింది : KTR