తెలంగాణ: హైదరాబాద్లో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మోకిల ఫేజ్-2 భూములను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ ) వేలం వేయనుండగా.. ధరలు ఎంత పలుకుతాయనేది ఆసక్తిగా మారింది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు 330 ప్లాట్లను, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మరో 30 ప్లాట్లను ఆన్లైన్లో వేలంవేస్తారు.
ఐదు రోజుల పాటు 300 ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేయనుంది. ప్రారంభ ధర చదరపు గజానికి రూ.25వేలుగా నిర్ణయించారు. 98,975 గజాల అమ్మకంతో రూ. 800 కోట్లు రావొచ్చని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. మోకిల ప్లాట్లు తొలి విడుత వేలంలో గరిష్ఠంగా గజానికి రూ. 1.05 లక్షలు పలికాయి. కనిష్ఠంగా గజానికి రూ. 72 వేలు పలికాయి.