Home   »  తెలంగాణ   »   చెరువులో పడి తల్లి కూతురు మృతి..!

చెరువులో పడి తల్లి కూతురు మృతి..!

schedule sirisha

నాగర్ కర్నూల్: బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లిన త‌ల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న నాగ‌ర్‌ క‌ర్నూల్ (NagarKurnool) మున్సిపాలిటీ ప‌రిధిలోని నాగ‌నోలు గ్రామంలో జరిగింది.

NagarKurnool |చెరువుకు వెళ్లిన త‌ల్లీకూతుళ్లు మృతి

స్థానికుల వివ‌రాల ప్రకారం, నాగ‌నోలు గ్రామానికి చెందిన నారమ్మ(55), ఆమె కూతురు సైదమ్మ(37) శనివారం బట్టలు ఉతకడానికి సమీపంలోని చెరువులోకి వెళ్లారు. అక్కడ బట్టలు ఉతుకుతు ప్రమాదవశాత్తు చెరువులో తల్లి పడింది. తల్లిని కాపాడే ప్రయతంలో కూతురు కూడా చెరువులో పడి మునిగి పోయారు.

ఇది గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఆదివారం వారి మృతదేహాలను గజ ఈతగాళ్లతో వెతికించి చివరకు వెలికి తీశారు. సైదమ్మ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Also read : ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి.