తెలంగాణలో 2023-24 సంవత్సరానికి గాను 1,395 మంది గిరిజన విద్యార్థులకు నేషనల్ స్కాలర్షిప్లు, మరో 218 మందికి ST ఫెలోషిప్లను అందజేసినట్టు కేంద్ర గిరిజన శాఖ తెలిపింది. ఈ విషయమై లోక్సభలో రాష్ట్ర MPలు గడ్డం రంజిత్రెడ్డి, వెంకటేశ్నేత బొర్లకుంట, మాలోత్ కవిత అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఫెలోషిప్స్ కింద ఎంఫిల్ విద్యార్థులకు రూ. 31వేలు, PHD విద్యార్థులకు తొలి రెండేళ్లు రూ.31 వేలు, చివరి మూడేళ్లు రూ. 35 వేలు ఇస్తున్నట్లు తెలిపారు.
1,395 మంది విద్యార్థులకు నేషనల్ ST స్కాలర్షిప్లు
Related News
Also Read