ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పాఠశాల క్యాంపస్లో ఫ్లెక్స్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తో18 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన జవహర్ నవోదయ విద్యాలయ (JNV) పాఠశాలలో జరిగింది.
మృతుడు దుర్గా నాగేంద్ర, మరో ముగ్గురు 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కలిసి రాబోయే క్రీడా దినోత్సవం కోసం ఫ్లెక్స్ బోర్డును ఏర్పాటు చేస్తుండగా మెయిన్ లైన్ తీగలు తాకి కరెంట్ షాక్ కొట్టింది. నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు.
నవోదయ విద్యాలయ సమితి (NVS) హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ టి గోపాల కృష్ణ శనివారం అర్థరాత్రి సమయంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో చంద్ర బాబును తక్షణమే సస్పెండ్ చేసినట్లు, NVS ప్రాంతీయ కార్యాలయానికి తెలిపారు.