భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన లండన్లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యనివర్సిటీ కీలక ఉపన్యాసం ఇవ్వడానికి MLC కల్వకుంట్ల కవిత ను ఆహ్వానించింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీలక ఉపన్యాసం ఇవ్వనున్న MLC కవిత..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత అక్టోబర్ 30న లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీలక ఉపన్యాసం చేయనున్నారు.
కాగా, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయని, ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి ప్రారంభించిన అనేక కార్యక్రమాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దృష్టిని ఆకర్షిస్తున్నాయని కవిత అన్నారు. ఆమె ఇటీవల లండన్ పర్యటనలో భాగంగా బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమం, తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ సాధించిన గణనీయమైన ప్రగతి గురించి కవిత వివిధ కళాశాలల విద్యార్థులతో మాట్లాడిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా రైతులకు రైతుబంధు (పెట్టుబడి మద్దతు), 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా సహా వ్యవసాయ రంగంలో తీసుకున్న ఆకట్టుకునే చర్యల గురించి వారికి తెలియజేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సౌకర్యాలతో వైద్యం, విద్య రంగాల్లో సాధించిన ప్రగతిని యూనివర్సిటీలో MLC కవిత ప్రసంగిస్తారు.