Home   »  తెలంగాణ   »   పాగాల సంపత్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన కేటీఆర్‌..

పాగాల సంపత్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన కేటీఆర్‌..

schedule mounika

బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జెడ్పి ఛైర్మన్ పాగాల సంపత్‌ రెడ్డి(Pagala Sampath Reddy) పార్ధివదేహానికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నివాళులు అర్పించారు.

జెడ్పి ఛైర్మన్ పాగాల సంపత్‌ రెడ్డి పార్ధివదేహానికి B.R.S పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నివాళులు అర్పించారు. అనంతరం సంపత్ రెడ్డి (Pagala Sampath Reddy) కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్‌రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్‌రెడ్డి మరణం ప్రతి బీ.ఆర్‌.ఎస్ కార్యకర్తను కలచి వేసిందన్నారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి:KTR

సంపత్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

కాగా, ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. యువకుల నుంచి పెద్దవారి వరకు చాలామంది మరణిస్తున్నారు. తాజాగా.. జనగామ జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. పాగాల సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు.

Pagala Sampath Reddy మరణం బాధాకరం: KCR

B.R.S పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్, పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడం పట్ల బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి తన వెంట నడిచిన యువనేత సంపత్ రెడ్డి మరణం బాధాకరమని కేసీఆర్ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. శోకంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంపత్ రెడ్డి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన సత్యవతి రాథోడ్..

జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గారి అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. సంపత్ రెడ్డి మృతి ఎంతో బాధకారమని సత్యవతి రాథోడ్ అన్నారు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు సత్యవతి రాథోడ్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read: CID’ నటుడు దినేష్ ఫడ్నిస్ మృతి…!