Home   »  తెలంగాణ   »   నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం…

నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం…

schedule mounika

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్ర పటానికి పరకాల బస్టాండ్ సెంటర్లో పాలాభిషేకం చేసిన పరకాల మాజీ ఎమ్మెల్యే మోలుగురి బిక్షపతి.

పరకాల మాజీ శాసనసభ్యులు మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెలందరికీ మోదీ గారి రక్షా బంధన్ కానుక. ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన లబ్ధిదారులకు రూ. 400 సబ్సిడీ అందించడం పేదల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.

ఈ తగ్గింపు వల్ల ప్రయోజనం పొందనున్న దేశంలో 33 కోట్ల మంది వంట గ్యాస్ వినియోగదారుల తరఫున, నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజలకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వ పథకాలు పంట బీమా పథకం మరియు ఆయుష్మాన్ భారత్ పథకం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్న BRS రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు విమర్శించారు..