హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇక నుంచి సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయాలని TSPSC నిర్ణయించింది. గతేడాది డిసెంబర్ నుంచి నిర్వహించిన అన్ని పరీక్షలకు సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు కమిషన్ తెలిపింది. ఉద్యోగాల భర్తీలో సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయాలని గతంలో రాజేష్కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఇటీవలే తెలంగాణ హైకోర్టు సైతం దీనిని సమర్థించింది. గ్రూప్-1లో సమాంతర మహిళా రిజర్వేషన్లు వర్తింపజేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్-1తోపాటు మరో మూడు కేసుల్లోనూ సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు సూచనల నేపథ్యంలో TSPSC నిర్వహించే అన్ని పరీక్షలకు సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేయాలని కమిషన్ నిర్ణయించింది.
సమాంతర రిజర్వేషన్లు… ఉద్యోగాల భర్తీపై TSPSC కీలక నిర్ణయం
Related News
Also Read