శంకరపట్నం: లారీ, బస్సు ఢీ.. శంకరపట్నంలోని కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిలో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పరకాల డిపోకు చెందిన టీఎస్ 24 జెడ్ 0016 నెంబర్ గల ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తుంది.
మార్గమధ్యంలో శంకరపట్నం వద్ద ముందుగా వెళుతున్న లారీని ఢీకొంది. గాయపడిన సుమారు 15 మందిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మరో బస్సులో వారిని పంపించారు