Home   »  తెలంగాణ   »   నేడు ప్రధాని మోదీ తెలంగాణ టూర్..!

నేడు ప్రధాని మోదీ తెలంగాణ టూర్..!

schedule mahesh
Prime Minister Modi's Telangana tour today..!

Prime Minister Modi | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని మోదీ నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని, సీఎం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానితో పాటు ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. NTPC రామగుండం రెండో యూనిట్, అంబారి-ఆదిలాబాద్-పింపల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నందున ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

9వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న Prime Minister Modi

మంగళవారం రోజున ప్రధాని సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత బహిరంగ సభలో ప్రసంగించి అనంతరం రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై కూడా ప్రధాని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్-సికింద్రాబాద్ MMTS ఫేజ్-2, ఘట్‌కేసర్-లింగంపల్లి కొత్త MMTS ను ప్రారభించనున్నారు.

Also Read | తెలంగాణలో 17 MP సీట్లు గెలుచుకుంటాం: బండి సంజయ్‌