హైదరాబాద్ | హైదరాబాద్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి, అతని ఎనిమిదేళ్ల కుమారుడు మృతి చెందారు.
Road Accident in Hyderabad
Road Accident in Hyderabad | హైదరాబాద్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి, అతని ఎనిమిదేళ్ల కుమారుడు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కుట్లూరు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ ను టిప్పర్ ఢీకొనడంతో బైక్ ఒకసారిగా మంటలు చెలరేగాయి. బైక్ పూర్తిగా దగ్ధం కాగా, టిప్పర్ పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఓ పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం మృతిచెందిన వారిని అబ్దుల్లాపూర్మెట్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన కుమార్ (40), అతని కుమారుడు ప్రదీప్ (8)గా గుర్తించారు. ప్రమాదం తర్వాత టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు.
Also Read: Cyber crime: 277 సైబర్ కేసులున్న మోసగాడిని కోర్టులో హాజరుపరిచిన సంగారెడ్డి పోలీసులు