Home   »  తెలంగాణ   »   ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్ట్!

ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్ట్!

schedule sirisha

హన్మకొండ: ముగ్గురు దారి దోపిడీ దొంగల (Robbers) ను హసన్‌పర్తి పోలీసులు సోమవారం ఒక పథకం ప్రకారం పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠా హైవేలపై వరుస దోపిడీలు, చోరీలకు పాల్పడుతూ నిద్రిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని వారి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్తున్నారు. నిందితులను తిక్క యశ్వంత్, దారంగుల అంజి, కుమ్మరి రాజేష్‌లుగా గుర్తించినట్లు తెలిపారు.

ముగ్గురు దారి దోపిడీ దొంగల (Robbers) ను పట్టుకున్నారు

CP అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో హసన్‌పర్తి పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం వీరిని అరెస్టు చేసారు. విచారణలో నిందితులు గత కొన్ని నెలలుగా హైవేలపై పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు.

180 సీసీ పల్సర్ బైక్‌పై గస్తీ తిరుగుతూ రాత్రిపూట నిర్జన ప్రాంతాల్లో తిరిగే వారిపై దాడికి పాల్పడుతున్నారు. నిందితులపై దొంగతనం, దోపిడీ, దాడి వంటి అభియోగాలతో కేసు నమోదు చేసి FIR ఫైల్ చేసారు.

Also read : 300 కిలోల గంజాయి స్వాధీనం… ఇద్దరి అరెస్ట్..