Home   »  తెలంగాణ   »   సింగరేణి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన CM

సింగరేణి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన CM

schedule mahesh

Singareni job | సింగరేణిలో 441 మందికి హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

singareni-job-appointment-papers-handed-by-cm

Singareni job | సింగరేణిలో 441 మందికి హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 412 మందికి కారుణ్య నియామక పత్రాలు, 29 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశారు. వీరిలో బ‌దిలీ వ‌ర్క‌ర్లు, జూనియ‌ర్ అసిస్టెంట్లు, మోటారు మెకానిక్‌లు ఉన్నారు.

రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటం అద్భుతమన్న సీఎం

ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాదనలో కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు. కేంద్రం కూడా సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు.

సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే: CM ఆదేశం

గత ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్ కు అండగా నిలిచి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వేలాది ఓట్ల మెజారిటీ రావడం వెనుక సింగరేణి కార్మికుల కృషి వుందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ళు అధికారంలో వున్న BRS పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని సిఎం అన్నారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటివలే తాను ఆదేశించినట్లుగా సీఎం స్పష్టం చేశారు.

సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామన్న CM

సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. కారుణ్య నియామకాల వయస్సు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకట స్వామి, కూనంనేని సాంబశివ రావు, గడ్డం వినోద్, పాయం వెంకటేశ్వర్లు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్, కొక్కిరాలా ప్రేమ్ సాగర్ రావు, కోవా లక్ష్మీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి ఎండీ బలరాం నాయక్, INTUC జనరల్ సెక్రెటరీ జన ప్రసాద్, సింగరేణి కాలరీస్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read | నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు