14 మంది పై దాడి చేసిన వీధికుక్కలు
తెలంగాణ: మహబూబాబాద్లోని మరిపెడ మండలం అనేపూర్ గ్రామంలో ఆదివారం 2 పశువులతో సహా 14 మంది పై వీధికుక్కలు దాడి చేశాయి.
దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ,మిగిలిన వారికి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి డిశ్చార్జి చేశారు.
కుక్కలను పట్టుకోకపోవడంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు భయపడి ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు.
హైదరాబాద్ బాలానగర్లోని వినాయక్నగర్లో 8 మంది చిన్నారులతో సహా 16 మందిపై వీధికుక్క దాడి చేసిన ఘటన మార్చి నెలలో ఇదే తరహాలో జరిగింది.
రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కుక్క దాడి చేయడంతో మూడేళ్ల బాలికతో సహా నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.