హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల (Telangana Elections) దృష్ట్యా నవంబర్ 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్ల తో సహా అన్నిరకాల మద్యం షాపులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 30 పోలింగ్ ముగిసే వరకు అవి మూసివేయబడతాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగే రోజున కూడా మళ్లీ మద్యం షాపులను మూసివేయలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల్లో 48 గంటల పాటు మద్యం, ఇతర పదార్థాలను పూర్తిగా నిషేధించాలని, అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.
నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.