Home   »  తెలంగాణ   »   Dharma Reddy :రైతులను కంటికి రెప్పల కాపాడుకుంటున్న కేసీఆర్.

Dharma Reddy :రైతులను కంటికి రెప్పల కాపాడుకుంటున్న కేసీఆర్.

schedule mounika

రైతులను కంటికి రెప్పల కాపాడుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి(Dharma Reddy) అన్నారు.

బుధవారం పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి లతో కలిసి పాల్గొన్నారు.

రైతన్న సంక్షేమం కోసం ఎన్నో పథకాలు :Dharma Reddy

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి(Dharma Reddy) మాట్లాడుతూ.. చైర్మన్‌, వైస్ చైర్మన్‌ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులకు అండగా నిలవాలని కోరారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. వ్యవసాయ రంగానికే సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే రైతన్న సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు, రైతులకు అండగా ఉండేందుకే BRS ను ఏర్పాటు చేశామన్నారు. దేశ ప్రజలు కేసీఆర్‌ను కావాలనుకుంటున్నారని చెప్పారు.

స్వ రాష్ట్రంలో రైతన్నను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్‌.. రాళ్లవానతో దెబ్బతిన్న పంటలతో దిగులుపడ్డ రైతన్న వద్దకే రాష్ట్ర యంత్రాంగాన్ని పంపి వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు.  రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన రైతుబంధు అండగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో రైతులకు అండగా నిలిచేందుకు రైతుబంధు సమితిలు కీలకం కానున్నాయన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మార్కెట్, సొసైటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతుబంధు కన్వీనర్లు, సభ్యులు, BRSనాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.