Home   »  తెలంగాణ   »   తుమ్మనపల్లి బస్టాండ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

తుమ్మనపల్లి బస్టాండ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

schedule ranjith

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలంలోని తుమ్మనపల్లి బస్టాండ్‌ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు . ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు వెనుక నుండి ఢీకొంది. ఈ ఘటనలో లింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్టలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.