Home   »  తెలంగాణ   »   డ్రగ్స్‌.. కేసులో టాలీవుడ్‌ నటులు..

డ్రగ్స్‌.. కేసులో టాలీవుడ్‌ నటులు..

schedule ranjith

డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు వెంకట్‌ రిమాండు రిపోర్టులో సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు ఉన్నాయి. వెంకట్‌ నుంచి నిర్మాతలు కలహర్‌రెడ్డి, సుశాంత్‌రెడ్డితో పాటు నటులు నర్సింగ్‌, రాంచంద్‌, అర్జున్‌, ఉప్పలపాటి రవి, ఇంద్రతేజ, రాంకుమార్‌ తదితరులు డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు తేలింది. మొత్తంగా 18 మందికి డ్రగ్స్‌ అమ్మినట్లు వెంకట్‌ ఒప్పుకున్నారు. పోలీసులు ఆ 18 మంది ఎవరు అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. బెంగళూరు, గోవా నుండి డ్రగ్స్‌ని హైదరాబాద్‌ తీసుకువచ్చి పలువురికి విక్రయిస్తూ రేవు పార్టీలు నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు.