హైదరాబాద్ | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్ కండక్టర్పై ఓ మహిళ దాడి చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో ఉన్న మహిళ బస్సు కండక్టర్లను అసభ్యకరంగా బండ బూతులు తిడుతూ దాడికి పాల్పడింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఘటనకు చెందిన వీడియోలో, 500 రూపాయలకు కండక్టర్ చిల్లర లేదని చెప్పడంతో మహిళా ప్రయాణికురాలు ఆ కండక్టర్తో గొడవకు దిగింది. ఈ గొడవలో హైదరాబాద్లోని హయత్నగర్ డిపో-1కి చెందిన బస్సు కండక్టర్లను మహిళ బెదిరించడం వీడియోలో వినిపించింది. ఈ ఘటనపై TSRTC MD సజ్జనార్ ఎల్.బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిబద్ధతతో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని TSRTC యాజమాన్యం స్పష్టం చేసింది’’ అని టిఎస్ఆర్టిసి MD VC సజ్జనార్ ట్వీట్ చేశారు.
Also Read: టిఎస్ఆర్టిసి లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..!