హైదరాబాద్ | వనస్థలిపురం సుష్మ థియేటర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు.
Road Accidents | వనస్థలిపురం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా వనస్థలిపురం సుష్మ థియేటర్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడి అక్కడి అక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తరువాత టిప్పర్ డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Road accident in Nalgonda | నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. 5గురు దుర్మరణం