హైదరాబాద్: హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కిండర్ గార్టెన్ విద్యార్థి (UKG student) సోమవారం మరణించాడు. శనివారం పాఠశాలలో టీచర్ కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిన హేమంత్ (5) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిన్నారి హేమంత్ (5) రామంతపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. రామాంతపూర్ ప్రాంతంలోని వివేక్ నగర్లోని ఓ పాఠశాలలో యూకేజీ చదువుతున్న విద్యార్థి హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఉపాధ్యాయుడు స్లేట్తో తలపై కొట్టాగానే చిన్నారి వెంటనే కుప్పకూలిపోయాడు.
చిన్నారి క్లాస్లోనే కుప్పకూలిన వెంటనే పాఠశాల యాజమాన్యం స్పందించి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సోమవారం పాఠశాల ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు.
Also read : మెడికో విద్యార్థి మృతిపై TS మైనారిటీ కమిషన్ విచారణ