వరంగల్ | వరంగల్ నుండి విహార యాత్రకు బయలుదేరిన మిత్ర బృందంలో ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
ప్రధానాంశాలు
Warangal నుండి మారేడుమిల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం
వరంగల్లోని శివనగర్ ప్రాంతానికి చెందిన ఐదుగురు స్నేహితులు మారేడుమిల్లికి వెళుతుండగా ప్రమాదానికి గురైనట్టు చెబుతున్నారు. వాహనం నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టు గాయపడిన వారు పోలీసులకు తెలిపారు.
మహబూబాబాద్లో ఈ రోడ్డు ప్రమాదం
మహబూబాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో వరంగల్లోని శివనగర్ ప్రాంతానికి చెందిన యువకులు ప్రాణాలు కోల్పోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న యువకులు నూతన సంవత్సర వేడుకల్ని సెలబ్రేట్ చేసుకునేందుకు బయల్దేరారు. వరంగల్ నుంచి APలోని మారేడుమిల్లి వెళ్లేందుకు మిత్రులు ప్లాన్ చేసుకున్నారు.
కారు అదుపుతప్పి చెట్టును ఢీ
మహబూబాబాద్ జిల్లా ఏటిగడ్డ తండా సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంగళదాసు, సాయిరామ్, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: Road Accident in Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం