కామారెడ్డి మున్సిపాలిటీలో మంత్రులు, పురపాలక మంత్రి KTRతో కలిసి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని నర్సన్నపల్లి వద్ద స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ మీడియన్ను మంత్రులు ప్రారంభించారు. కామారెడ్డి బైపాస్ రోడ్ నుండి ఈఎస్ఆర్ గార్డెన్ వరకు నిర్మించిన ఆరు వరుసల రహదారి పనులు ప్రారంభించారు.
మున్సిపల్ ఆఫీస్ నుండి ఈఎస్ఆర్ గార్డెన్, టేక్రియల్ బైపాస్ నుండి ఇందిరా గాంధీ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన రోడ్డు రవాణా పనులకు శంకుస్థాపన చేసారు. టేక్రియల్ బైపాస్ వద్ద నిర్మించిన 6 లైన్ల రోడ్డు,సెంట్రల్ లైటింగ్ ను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.