సుల్తానాబాద్ | వివాహం కావడం లేదన్న నెపంతో సుల్తానాబాదులో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Suicide | పెళ్లి కొందరికి వరమైతే మరికొందరికి శాపమవుతుంది. లక్షల కట్నాలు, తులాల కొద్దీ బంగారం ఇచ్చినా, వరకట్నం దాహం తీరక భార్యను నానా హింసలు పెట్టి ఆఖరికి తనకు తానే ప్రాణాలు తీసుకునేలా చేసే భర్తలున్నారు. అంతా అయిపోయాక మరో పెళ్లికి కూడా రెడీ అయిపోతారు. కొందరికైతే వయసు మీదపడుతున్నా పెళ్లి కాదు. రకరకాల కారణాల వల్ల సమాజంలో పెళ్లికాని యువకుల సంఖ్య పెరిగిపోతోంది. పాతికేళ్లైనా నిండకుండానే పెళ్లిళ్లు చేసుకునేవారే ఎక్కువగా ఉన్నారు. ఓ యువకుడు తనకు ఎంతకూ పెళ్లి కావట్లేదని మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వివాహం కావడం లేదన్న నెపంతో సుల్తానాబాద్ లో ఓ యువకుడు బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు. SI విజేందర్ కథనం మేరకు, శాంతినగర్ కు చెందిన కోట నరేష్ (25) కూలీ పనులు చేసేవాడు. సంవత్సరం క్రితం నరేష్ తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. మూడు నెలలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరకపోవడంతో జీవితంపై విరక్తి చెంది నరేష్ సోమవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read | సూర్యాపేట రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య