హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే మూడో ట్రాక్ పనుల కోసం ఈ నెల 7 నుంచి 14 వరకు కాజీపేట– బల్లార్షా రైల్వే స్టేషన్ల మధ్య నడిచే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు రైల్వే అధికారులు జారీ చేశారు.
3వ రైల్వే పనుల నేపథ్యంలో వారం రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేట-కాగజ్నగర్, భద్రాచలం-కాగజ్నగర్, కాగజ్నగర్-భద్రాచలం, కాగజ్నగర్-కరీంనగర్, కరీంనగర్-కాగజ్నగర్ ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. పలు చోట్ల రైల్వే గేట్ల ని తాత్కాలికంగా మూసివేశారు.